చిల్కనగర్ : తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, చిల్కానగర్ డివిజన్ సెంట్రింగ్ వర్క్స్ అసోసియేషన్ గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రెటరీ యాదగిరి ముదిరాజ్, చిల్కానగర్ డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్, చైర్మన్ రాజు మరియు కార్యదర్శి కృష్ణ వారి ఆధ్వర్యంలో పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిలక నగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు,
కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ మాట్లాడుతూ చిల్కానగర్ డివిజన్ పేద ప్రజలు నివసించే ప్రాంతమని ఇటువంటి ఆపత్ కరమైన సమయంలో పేద ప్రజలకు అన్నదానం కార్యక్రమాలు చేయడం నిజంగా కూడా చాలా అభినందనీయమని చిల్కానగర్ జోన్ సెంట్రింగ్ అసోసియేషన్ సభ్యులకు ప్రత్యేకంగా అభినందించారు .
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ తెరాస సీనియర్ నాయకులు పల్లె నర్సింగ్ రావు, ఏదుల కొండల్ రెడ్డి, రామ్ రెడ్డి , ఈరెల్లి రవీందర్ రెడ్డి, మాస శేఖర్, వెంకటేష్, మహేందర్, బింగి శ్రీనివాస్ శ్రీకాంత్ బాలు మొదలగు వారు పాల్గొన్నారు.