మేడిపల్లి : బోడుప్పల్ లో నకిలీగాళ్ళ నాటకాలు రోజు రోజుకి తార స్థాయికి చేరుతున్నాయి.. ఈ నేపథ్యంలో
జీహెచ్ఎంసీ అధికారులం అని చెప్పుకుంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పట్టుకొని మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….
గత కాలంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారంటూ ఇంటి యజమానులకు బెదిరిస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తూ అక్రమంగా వసూళ్లు చేస్తున్న బాలరాజు, రాజు అనే ఇద్దరు వ్యక్తులు మంగళవారం ఉదయం 1వ డివిజన్ లోని క్రాంతి నగర్ కాలనీ, చిన్న క్రాంతి కాలనీలో నిర్మాణంలో ఉన్న కొన్ని ఇళ్ల వద్దకు వెళ్లి ఎప్పటిలాగే డబ్బులు కావాలని డిమాండ్ చేశారు. అప్పటికే అనేక మార్లు ఇలాంటి సంఘటన జరుగుతుండటం గమనించిన మున్సిపల్ సిబ్బంది వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు బోడుప్పల్ మున్సిపల్ కమిషనర్ భువనగిరి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మేడిపల్లి పోలీసులు చేస్తున్నారు. విచారణ