*స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి*
*రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhaker)కలిసిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి*(National BC Dal president Dundra kumara Swamy)
*బడుగు బలహీన వర్గాల సంక్షేమం అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ఎంతగానో పాటుపడుతూ ఉన్నారు అని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అన్నారు.
బీసీలకు మంచి చేయడానికి మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ముందుకు రావడం శుభపరిణామమని.. అందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన కృషిని మరిచిపోలేమని కొనియాడారు జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి. పంచాయతీల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల పెంపుపై సెక్రటేరియెట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలు, రాబోయే ఎన్నికల్లో వాటి పెంపునకు సంబంధించిన వివరాలను సీఎం అధికారుల నుంచి తెలుసుకున్నారు. గత పంచాయతీ ఎన్నికల్లో అనుసరించిన విధానం, రానున్న పంచాయతీ ఎన్నికలకు రెడీ అవుతున్న తీరును సీఎంకు అధికారులు వివరించారు.
బీసీలకు ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయకపోవడంతో గత దశాబ్దాలుగా బీసీలు నష్టపోతూనే ఉన్నారని దుండ్ర కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడైనా న్యాయం చేసేలా తెలంగాణ ముఖ్యమంత్రి ముందుకు రావడం అభినందనీయమన్నారు. పల్లకీ మోసే బీసీలకు పట్టం కట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ చేస్తున్న చర్యలను బీసీలు ఎప్పటికీ మరచిపోరు. ఇప్పటికే రుణ మాఫీ చేసి ప్రశంసలు అందుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. పంచాయతీ ఎన్నికల్లో కొత్త రిజర్వేషన్లను అమలు చేసి బీసీలకు పట్టం కడుతుందని ఆశిస్తూ ఉన్నాం.