శేరిలింగంపల్లి చందానగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మీనాక్షి వస్త్ర స్టోర్ ను మీనాక్షి టీమ్,నిర్వాహకులు శ్యామ్ పాల్ అద్వర్యం లో రాష్ట్ర హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ, మేయర్ విజయ లక్ష్మి, కార్పొరేటర్ మంజుల రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ స్వయం ఉపాధి మార్గం ఎంచుకొని ముందుకు సాగడం అభినందనీయమని మేయర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులైన శ్యామ్ పాల్ ని కార్పొరేటర్, మేయర్, మినిస్టర్ అభినందించారు మార్కెట్ లో ఉన్న పోటీని తట్టుకుని మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. కస్టమర్లకు మంచి సేవలు అందిస్తూ వారి మన్ననలు పొందాలని నిర్వాహకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆన్కర్ శ్రీముఖి, సింగర్ మంగలి, మీనాక్షి స్టోర్ నిర్వాహకులు శ్యామ్ పాల్ వారి కుటుంబ సభ్యులు,అవినాష్,షాప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డాక్టర్ వకుళాభరణం
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డాక్టర్ వకుళాభరణం తిరుపతి: మంగళవారం నాడు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని, ప్రాత కాల బిగినింగ్ బ్రేక్ దర్శనంలో భాగంగా రాష్ట్ర...
Read more