సిద్దిపేట : తెలంగాణ రాష్ట్ర, సిద్దిపేట జిల్లాలో,
ఈరోజు సిద్దిపేట లో పలు అభివృద్ధి పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభోత్సవం చెయ్యడం జరిగింది. అందులో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కూడా పాల్గొన్నారు. ఆ కార్యక్రమాలు అన్ని ముగించుకొని హైదరాబాద్ కి తిరుగు ప్రయాణంలో వస్తుండగా హరీష్ రావు కారుకు ముందుగా వెళ్తున్న పైలెట్ కారుకు అడవి పంది అడ్డుగా రావడంతో కారు డ్రైవర్ సడన్ గా బ్రేక్ వెయ్యడం తో హరీష్ రావు కారు పైలెట్ కారుని ఢీకొట్టింది, దానితో ఒకదానికొకటి కాన్వాయ్ ఢీకొనడంతో వెళ్తున్న కార్లన్నీ దాదాపుగా ధ్వంసం అయ్యాయి. అందులో ఉన్న సెక్యూరిటి సిబ్బందికి మాములు గాయాలయ్యాయి. ఇందులో మంత్రి హరీష్ రావు కి మాత్రం ఎలాంటి ప్రమాదం జరగలేదు. దాంతో అందరూ ఉపిరిపీల్చుకున్నారు. హరీష్ రావు వేరే కారులో హైదరాబాద్ కి బయలుదేరారు..
Blissberg Future of Hope ఆధ్వర్యంలో పంచ ఆరోగ్య దినోత్సవం
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం - ఏప్రిల్ 7, 2025 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా "అందరికీ మంచి ఆరోగ్యం 2025" అనే గొప్ప లక్ష్యంతో బ్లిస్బర్గ్ ఫ్యూచర్...
Read more